కొండపోచమ్మసాగర్‌‌ వద్దకు కేసీఆర్... షెడ్యూల్ ఇదే...

ABN , First Publish Date - 2020-05-29T04:10:40+05:30 IST

కొండపోచమ్మ సాగర్‌ వద్దకు సీఎం కేసీఆర్‌ వెళ్లనున్నారు. సోమవారం ఉదయం 4.30కి కొండపోచమ్మ ఆలయంలో ఛండీయాగం చేస్తారు. ఈ యాగంలో..

కొండపోచమ్మసాగర్‌‌ వద్దకు కేసీఆర్... షెడ్యూల్ ఇదే...

హైదరాబాద్: కొండపోచమ్మ సాగర్‌ వద్దకు సీఎం కేసీఆర్‌ వెళ్లనున్నారు. సోమవారం ఉదయం 4.30కి కొండపోచమ్మ ఆలయంలో ఛండీయాగం నిర్వహిస్తారు. ఈ యాగంలో సీఎం కేసీఆర్‌ దంపతులు పాల్గొననున్నారు. ఉదయం 9.30కి ఎర్రవెల్లిలో రైతు వేదికకు సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన చేయనున్నారు. 9.40కి మర్కూక్‌లో రైతు వేదికకు శంకుస్థాపన చేస్తారు. 11.30కి మార్కూక్‌లో పంప్‌హౌస్‌ను ప్రారంభించనున్నారు. ఉదయం 11.45కి గోదావరి జలాలకు కేసీఆర్‌ ప్రత్యేక పూజలు చేస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు వరద రాజేశ్వరస్వామి దేవాలయంలో పూజలు చేస్తారు. సుదర్శన యాగం, పూర్ణాహుతిలో కేసీఆర్‌, చినజీయర్‌ పాల్గొననున్నారు. 


Updated Date - 2020-05-29T04:10:40+05:30 IST