ఇంత దిగజారిన కేంద్ర ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదు: కేసీఆర్

ABN , First Publish Date - 2021-11-30T00:52:40+05:30 IST

తెలంగాణ వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం తీరుపై సీఎం కేసీఆర్ మండిపడ్డారు. కేబినెట్ భేటీ తర్వాత సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. ధాన్యంపై కేంద్రం సామాజిక బాధ్యతను ...

ఇంత దిగజారిన కేంద్ర ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదు: కేసీఆర్

హైదరాబాద్: తెలంగాణ వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం తీరుపై సీఎం కేసీఆర్ మండిపడ్డారు. కేబినెట్ భేటీ తర్వాత సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. ధాన్యంపై కేంద్రం సామాజిక బాధ్యతను విస్మరించిందని కేసీఆర్ విమర్శించారు. దేశ రైతాంగాన్ని కేంద్రం గందరగోళానికి గురి చేస్తోందని ఆరోపించారు. కేంద్రం చిల్లర కొట్టు షావుకారుగా వ్యవహరిస్తోందని, ఆహార భద్రత సామాజిక బాధ్యత అని చెప్పారు. నష్టం వస్తే కేంద్రం భరించాలని, నిల్వలు ఎక్కువైతే ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని కేసీఆర్ సూచించారు. బీజేపీ ప్రభుత్వం వచ్చాక రైతు వ్యతిరేక విధానాలు అవలంభిస్తోందన్నారు. గ్యాస్, పెట్రో ధరలు పెంచి సామాన్యుల నడ్డి విరిచారని విమర్శించారు.   


"బాయిల్డ్ రైస్ కొనమని కేంద్రం స్పష్టంగా చెప్పింది. రా రైస్ ఎంత తీసుకుంటారో కూడా కేంద్రం చెప్పలేదు. 90లక్షల టన్నుల ధాన్యం తీసుకోవాలని కేంద్రాన్ని కోరాం. యాసంగిలో వడ్లు పండితే నూక ఎక్కువగా వస్తుంది. నష్టపోకుండా ఉండేందుకే మిల్లర్లు బాయిల్డ్ రైస్ చేస్తున్నారు. మెడపై కత్తిపెట్టి కేంద్రం బలవంతంగా అగ్రిమెంట్ రాయించుకుంది. ఢిల్లీకి వెళ్తే మొహంలేక మాకు అపాయింట్‌మెంట్ ఇవ్వలేదు. ఇంత దిగజారిన కేంద్ర ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదు. విభజన చట్టం ప్రకారం కేంద్రం సహకారం అందివ్వడంలేదు. ఏపీ ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేసినా.. ప్రాజెక్టులు నిర్మించాం. రైతులకు అండగా ఉంటామని కిషన్‌రెడ్డి అన్నారు. కిషన్‌రెడ్డికి దమ్ముంటే కేంద్రంతో బాయిల్డ్‌ రైస్ కొనించాలి'' అని కేసీఆర్ డిమాండ్ చేశారు. 



Updated Date - 2021-11-30T00:52:40+05:30 IST