కరోనాపై సీఎం కేసీఆర్‌ సమీక్ష

ABN , First Publish Date - 2021-12-19T02:53:11+05:30 IST

రాష్ట్రంలో ఒమైక్రాన్‌ కేసులు నమోదు అవుతుండడంతో కరోనా

కరోనాపై సీఎం కేసీఆర్‌ సమీక్ష

హైదరాబాద్: రాష్ట్రంలో ఒమైక్రాన్‌ కేసులు నమోదు అవుతుండడంతో కరోనా పరిస్థితులపై అధికారులతో సీఎం కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు. ఒమైక్రాన్‌ కట్టడికి తీసుకోవలసిన ముందస్తు చర్యలపై సీఎం కేసీఆర్‌ ఆరా తీశారు. కేసులు, వ్యాక్సినేషన్‌ వివరాలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో పరిస్థితి అదుపులోనే ఉందని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా కట్టడికి తీసుకోవాలసిన చర్యలను వివరించారు. ఒమైక్రాన్‌‌పై ప్రజలను చైతన్యవంతం చేయాలన్నారు. కేసులు పెరుగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. 

Updated Date - 2021-12-19T02:53:11+05:30 IST