కొవిడ్ నియంత్రణపై సీఎం కేసీఆర్ సమీక్షా సమావేశం
ABN , First Publish Date - 2021-07-10T01:06:58+05:30 IST
రాష్ట్రంలో కొవిడ్ నియంత్రణపై సీఎం కేసీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. మరోసారి
హైదరాబాద్: రాష్ట్రంలో కొవిడ్ నియంత్రణపై సీఎం కేసీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. మరోసారి కొవిడ్ ప్రభావిత ప్రాంతాల్లో జ్వర సర్వే జరుపాలని అధికారులను కేసీఆర్ ఆదేశించారు. సరిహద్దు రాష్ట్రాల్లో కరోనా పూర్తిగా నియంత్రణలోకి రాలేదన్నారు. కరోనా థర్డ్ వేవ్ పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. రాష్ట్రంలో కరోనా ఎలా వస్తుందో అర్థం కావడం లేదన్నారు. ఢిల్లీ, మహారాష్ట్ర, బెంగాల్ సహా ఇతర రాష్ట్రాల్లో కరోనా స్థితిగతులను, నియంత్రణ చర్యలను అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు.
వరంగల్ను హెల్త్ సిటీగా తీర్చిదిద్దే దిశగా చర్యలు చేపట్టాలని అధికారులను కేసీఆర్ ఆదేశించారు. ఈ నెల 11, 12, 13 తేదీల్లో సరిహద్దు జిల్లాల్లో ఆరోగ్యశాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో అధికారులు పర్యటించాలని అధికారులకు కేసీఆర్ సూచించారు.