తెలంగాణలో డ్రగ్స్ నియంత్రణ పై ప్రారంభమైన సీఎం సమావేశం

ABN , First Publish Date - 2022-01-28T22:22:56+05:30 IST

తెలంగాణలో డ్రగ్స్అన్న మాటే వినపడకూడదని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ దిశలో చర్యలకు ఉపక్రమించారు

తెలంగాణలో డ్రగ్స్ నియంత్రణ పై ప్రారంభమైన సీఎం సమావేశం

హైదరాబాద్: తెలంగాణలో డ్రగ్స్అన్న మాటే వినపడకూడదని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ దిశలో చర్యలకు ఉపక్రమించారు. ప్రగతి భవన్ లో గత కొద్ది నిమిషాల ముందే సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో పోలీసు శాఖ, ఎక్సైజ్ ఉన్నతాధికారులతో పాటు పలువురు మంత్రులు హాజరయ్యారు. తెలంగాణలో డ్రగ్స్ అన్న మాటే లేకుండా పూర్తిగా నిర్మూలించడంతో పాటు, ఇప్పటికే కేసులు ఉన్న వారిని కఠినంగా శిఓించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు.


కాగా రాష్ట్రంలో వెయ్యిమందితో నార్కొటిక్ అండ్ ఆర్గనైజ్డ్ కంట్రోల్ సెల్ విభాగాన్ని ఏర్పాటు చేయాలని ఇప్పటికే ముఖ్యమంతి పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ సెల్ డ్రగ్స్ వ్యవస్థీక`త నేరాలను నియింత్రించేలా పనిచేస్తుంది. డ్రగ్స్ పై నిరంతరం నిఘా కోసం కొత్త పోలీస్ యాప్ ను కూడా రూపొందించనున్నారు. 

Updated Date - 2022-01-28T22:22:56+05:30 IST