పోలీస్‌ అమర వీరులకు కేసీఆర్‌ ఘననివాళి

ABN , First Publish Date - 2020-10-21T21:02:31+05:30 IST

విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీస్‌ అమర వీరులకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఘనంగా నివాళులర్పించారు.

పోలీస్‌ అమర వీరులకు కేసీఆర్‌ ఘననివాళి

హైదరాబాద్‌: విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీస్‌ అమర వీరులకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఘనంగా నివాళులర్పించారు. ఈసందర్భంగా విధినిర్వహణలో వారు చూపించిన ధైర్యసాహసాలు, చిత్తశుద్ధిని శ్లాఘించారు.  పోలీసు అమర వీరుల స్మారక దినం సందర్భంగా సీఎం వారి సేవలను గుర్తుచేసుకున్నారు. దేశ ప్రజలు పోలీసుల సేవలను, త్యాగాలను ఎన్నడూ మర్చిపోలేరని అన్నారు. తమ ప్రాణాలను పణంగా పెట్టి ప్రజల ఆస్తులను రక్షించానికి కృస్తుంటారని అన్నారు. అమర వీరుల త్యాగాలను స్పూర్తిగా తీసుకుని పోలీసులు తమ విధి నిర్వహణలో పునరంకితం కావాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం పోలీసుల సంక్షేమం, వారి కుటుంబాల అత్యధిక ప్రాధాన్య ఇస్తుందన్నారు.

Updated Date - 2020-10-21T21:02:31+05:30 IST