సీఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలని అంజన్నకు ముడుపు
ABN , First Publish Date - 2021-04-21T06:16:10+05:30 IST
సీఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలంటూ ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు అంజన్న సన్నిధిలో మంగళవారం ఎమ్మెల్యే రవిశంకర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
- కొండగట్టులో ఎమ్మెల్యే రవిశంకర్ ప్రత్యేక పూజలు
- కేసీఆర్ కోలుకునే వరకు నిత్యం పూజలు
మల్యాల, ఏప్రిల్ 20: సీఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలంటూ ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు అంజన్న సన్నిధిలో మంగళవారం ఎమ్మెల్యే రవిశంకర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి వారికి ముడుపు కట్టారు. అంజన్న దయ, రాష్ట్ర ప్రజల ఆశీర్వాదంతో కేసీఆర్ త్వరగా కోలుకుంటారనే ఆశా భావం వ్యక్తం చేశారు. కేసీఆర్ కోలుకునే వరకు కొండగట్టు అంజన్న సన్నిధిలో శ్రీస్వామి వారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందని తెలి పారు. ఈ కార్యక్రమంలో మల్యాల, కొడిమ్యాల జడ్పీటీసీలు కొండపల్కుల రాంమో హన్రావు, పి.ప్రశాంతి సర్పంచిలు మిట్టపెల్లి సుదర్శన్, కృష్ణారావు, సింగిల్విండో చైర్మన్లు అయిల్నేని సాగర్రావు, బోయినిపెల్లి మధుసూధన్రావు, ఎం. రాంలిం గారెడ్డి, ఎం.రాజనర్సింగరావు, కొండగట్టు డైరెక్టర్లు కొంక నర్సయ్య, ఆసం శివకు మార్, జున్న సురేందర్, నాయకులు కోటేశ్వర్రావు, ఆగాంతపు వంశీధర్, తోట అంజయ్య తదితరులు పాల్గొన్నారు.