అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్న కేసీఆర్
ABN , First Publish Date - 2020-03-29T14:00:59+05:30 IST
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం సాయంత్రం 5గంటలకు ముఖ్య అధికారులతో వీడియో కాన్ఫరెన్స్..
హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం సాయంత్రం 5గంటలకు ముఖ్య అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్లు, ఎస్పీలు, డీఎంహెచ్వోలు, వ్యవసాయ, సివిల్ సప్లయ్ అధికారులు పాల్గొననున్నారు. ఈ కాన్ఫరెన్స్లో ప్రధానంగా కరోనా వైరస్ నియంత్రణ, లాక్డౌన్, నిత్యావసర వస్తువుల సరఫరా, ధాన్యం, ఇతర పంటల కొనుగోళ్లు తదితరవాటిపై చర్చించనున్నట్లు సమాచారం.
కగా శనివారం ఒక్కరోజే తెలంగాణలో 8 మందికి కరోనా పాజిటివ్ ఉన్నట్టు పరీక్షల్లో తేలింది. ఈ 8 మందిలో ఒకరు మరణించారు. తెలంగాణలో ఇప్పటివరకు 67 కేసులు నమోదవగా.. ప్రస్తుతం 65 మందికి ప్రభుత్వం చికిత్సను అందిస్తోంది. మిగిలిన ఇద్దరిలో ఒకర మరణించగా.. మరొకరు పూర్తిగా కోలుకున్నారు.