చినజీయర్ స్వామి ఆశ్రమానికి వెళ్లిన సీఎం కేసీఆర్
ABN , First Publish Date - 2021-10-11T20:53:08+05:30 IST
ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ త్రిదండి చినజీయర్ స్వామి ఆశ్రమానికి వెళ్లారు.
హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ త్రిదండి చినజీయర్ స్వామి ఆశ్రమానికి వెళ్లారు. వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. శంషాబాద్, ముచ్చింతల్లోని ఆశ్రమానికి సతీ సమేతంగా వెళ్లిన కేసీఆర్... చినజీయర్ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. రామానుజ సహస్రాబ్ది ఉత్సవం సందర్భంగా మొక్కలు నాటనున్నారు. ఈ కార్యక్రమం తర్వాత సీఎం కేసీఆర్ యాదాద్రి వెళ్లనున్నారు.