ప్రధాని మోదీకి సీఎం మమత లేఖ

ABN , First Publish Date - 2021-04-18T23:19:38+05:30 IST

ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. రాష్ట్రంలో కోవిడ్ ఉధృతిని ఉదహరిస్తూ లేఖ రాశారు

ప్రధాని మోదీకి సీఎం మమత లేఖ

కోల్‌కతా : ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. రాష్ట్రంలో కోవిడ్ ఉధృతిని ఉదహరిస్తూ లేఖ రాశారు. బెంగాల్‌లో వ్యాక్సిన్లు, రెమిడేసివిర్, ఆక్సిజన్, ఔషదాలు కావాలంటూ ఆమె కోరారు. వీలైనంత తొందరగా వీటిని తమ రాష్ట్రానికి పంపాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. ‘‘రాష్ట్రంలో కోవిడ్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ప్రచారం నిమిత్తమై రాష్ట్రేతరులు కూడా రాష్ట్రానికి వస్తున్నారు. ఇలాంటి సందర్భంలో కోవిడ్‌ను కట్టడి చేయడానికి యుద్ధం తరహాలో పోరాడాలి. వీటన్నింటికీ మీ సహకారం కావాలి’’ అని మమతా బెనర్జీ పేర్కొన్నారు. 

Updated Date - 2021-04-18T23:19:38+05:30 IST