మోసం చేసిన మహా ఘనుడు జగన్
ABN , First Publish Date - 2021-09-19T04:54:09+05:30 IST
ప్రజా సంకల్పయాత్రలో ప్రజలకు వాగ్దానాలు ఇచ్చి ముద్దుల వర్షం కురిపించి నేడు మోసం చేసిన మహా ఘనుడు జగన్ అని కోవూరు మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి విమర్శించారు.
విద్యుత్ చార్జీల పెంపును నిరసిస్తూ మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి, రైతులు, ప్రజల భారీ ర్యాలీ
ఇందుకూరుపేట, సెప్టెంబరు 18 : ప్రజా సంకల్పయాత్రలో ప్రజలకు వాగ్దానాలు ఇచ్చి ముద్దుల వర్షం కురిపించి నేడు మోసం చేసిన మహా ఘనుడు జగన్ అని కోవూరు మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి విమర్శించారు. పెంచిన కరెంటు చార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ శనివారం ఇందుకూరుపేట నుంచి కొత్తూరు కార్యాలయం వరకు భారీగా తరలివచ్చిన రైతులు, ప్రజలతో కలిసి ర్యాలీ నిర్వహించారు. అనంతరం విద్యుత్ శాఖ ఏడీఈకి వినతిపత్రం అందజేశారు. అనంతరం పోలంరెడ్డి విలేకరులతో మాట్లాడారు. పేద, మత్స్యకార ప్రజలు, ఆక్వా రైతులను మోసం చేసి సీఎం ఏం బావుకుంటాడని ప్రశ్నించారు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అని చెప్పి నేడు వేలకు వేలు పేదల నుంచి ట్రూ అప్ చార్జీల పేరుతో దోచుకోవడం అన్యాయమన్నారు. విద్యుత్ చార్జీలు తగ్గించే వరకు ఈ పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. పాదయాత్ర సమయంలో జగన్ చేసిన వాగ్దానాలను రికార్డ్ చేసి ప్రజలకు వినిపించారు. కార్యక్రమంలో జిల్లా నాయకుడు కిశోర్యాదవ్, మండల నాయకులు వీరేంద్ర, ఎం.రంగారావు, కొత్తూరు రామచంద్రయ్య పాల్గొన్నారు.