వీధుల్లో తిరిగే పశువుల మేతకు నిధులిచ్చిన నవీన్ పట్నాయక్

ABN , First Publish Date - 2021-06-04T01:08:54+05:30 IST

కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తి నిరోధం కోసం అమలు

వీధుల్లో తిరిగే పశువుల మేతకు నిధులిచ్చిన నవీన్ పట్నాయక్

భువనేశ్వర్ : కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తి నిరోధం కోసం అమలు చేస్తున్న అష్ట దిగ్బంధనం సమయంలో వీధుల్లో తిరిగే పశువుల మేత కోసం ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ నిధులు మంజూరు చేశారు. 


ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం గురువారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం, వీథుల్లో తిరిగే వీధి కుక్కలు, పశువులకు ఆహారం అందించడం కోసం సీఎం సహాయ నిధి నుంచి రూ.67.52 లక్షలు మంజూరు చేశారు. ఈ నిధుల్లో భువనేశ్వర్ నగర పాలక సంస్థ రోజుకు రూ.20 వేలు ఖర్చు చేయవచ్చు. మరొక నాలుగు నగర పాలక సంస్థలు రోజుకు రూ.10 వేలు చొప్పున ఖర్చు చేయవచ్చు. 48 పురపాలక సంఘాలు రోజుకు రూ.5 వేలు చొప్పున; 61 నోటిఫైడ్ ఏరియా కౌన్సిళ్ళు రోజుకు రూ.2,000 చొప్పున ఖర్చు చేయవచ్చు. 


నవీన్ పట్నాయక్ ఈ కార్యక్రమం కోసం ఈ ఏడాది రెండు విడతల్లో  రూ.1,13,94,000 విడుదల చేశారు. దీనికి అదనంగా గురువారం రూ.67.52 లక్షలు మంజూరు చేశారు.


Updated Date - 2021-06-04T01:08:54+05:30 IST