ఆ విషయంపై సోనియా దాటవేత దోరణి సరికాదు: సీఎం రమేష్

ABN , First Publish Date - 2022-01-09T17:38:45+05:30 IST

పంజాబ్‌లో ప్రధాని భద్రతా వైఫల్యంపై బీజేపీ నిరసన వ్యక్తం చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వ కుటిల బుద్ధిని ప్రజలు నిలదీయాలంటూ బీజేపీ నినాదాలు చేసింది.

ఆ విషయంపై సోనియా దాటవేత దోరణి సరికాదు: సీఎం రమేష్

విశాఖ: పంజాబ్‌లో ప్రధాని భద్రతా వైఫల్యంపై బీజేపీ నిరసన వ్యక్తం చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వ కుటిల బుద్ధిని ప్రజలు నిలదీయాలంటూ బీజేపీ నినాదాలు చేసింది. ఈ సందర్భంగా ఎంపీ సీఎం రమేష్ మాట్లాడుతూ.... ప్రధానికి పంజాబ్ ప్రభుత్వం భద్రత కల్పించలేకపోవడం నిర్లక్ష్యమేనన్నారు. ఈ అంశంపై సోనియాగాంధీ దాటవేత దోరణితో వ్యవహరించడం సరికాదన్నారు. దేశ ప్రజలందరూ ఈ సంఘటనను ఖండిస్తున్నారని తెలిపారు. ఏపీలో దళితులపై దాడులు ఆగడంలేదన్నారు. కొందరు పోలీసులు వైసీపీ కండువాలు వేసుకుని పనిచేస్తున్నారని మండిపడ్డారు. పోలీస్ వ్యవస్థ రాష్ట్ర ప్రభుత్వ చెప్పుచేతల్లో ఉందన్నారు. 

Updated Date - 2022-01-09T17:38:45+05:30 IST