ఇసుక లీజులు ఎవరికి ఇచ్చారు?: సీఎం రమేష్

ABN , First Publish Date - 2021-12-29T00:55:25+05:30 IST

ఇసుక లీజులు ఎవరికి ఇచ్చారు?: సీఎం రమేష్

ఇసుక లీజులు ఎవరికి ఇచ్చారు?: సీఎం రమేష్

ఢిల్లీ: రెండున్నరేళ్లుగా జరుగుతున్న అక్రమాలు, అన్యాయాలు చూశామంని ఎంపీ సీఎం రమేష్‌ అన్నారు. పాలనలో కొన్ని వందల అక్రమాలు, అన్యాయాలు చేశారని ఆయన ఆరోపించారు. కొత్తగా వచ్చిన ప్రభుత్వం కొంత సమయం ఇద్దామనుకున్నామన్నారు. ప్రజలకు ఒక్కటైనా మేలు చేసే కార్యక్రమం చేయలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ సంపద ఎక్కడికి పోయింది?, ఇసుక లీజులు ఎవరికి ఇచ్చారు? అని ఆయన ప్రశ్నించారు. బెదిరించి మైనింగ్‌ గనులను వశపర్చుకున్నారని ఆరోపించారు. కావాల్సిన లిక్కర్‌ బ్రాండ్లను కావాల్సిన వారితో అమ్ముతున్నారని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం రెండున్నరేళ్లలో 6 లక్షల కోట్లు అప్పులు చేసిందన్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కక్ష్య పూరితంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. 

Updated Date - 2021-12-29T00:55:25+05:30 IST