CM relief fund రూ.లక్ష విరాళం
ABN , First Publish Date - 2021-10-20T14:46:35+05:30 IST
బాగ్ లింగంపల్లిలోని బంగారు మా తెలంగాణ గృహకల్ప మార్కెట్ వేదిక ఆధ్వర్యంలో వేదిక అధ్యక్షుడు ఎం.వి.జనార్దన్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ తో కలిసి మంత్రి కేటీఆర్కు లక్ష
మంత్రి కేటీఆర్కు అందజేత
హైదరాబాద్/రాంనగర్: బాగ్ లింగంపల్లిలోని బంగారు మా తెలంగాణ గృహకల్ప మార్కెట్ వేదిక ఆధ్వర్యంలో వేదిక అధ్యక్షుడు ఎం.వి.జనార్దన్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ తో కలిసి మంత్రి కేటీఆర్కు లక్ష రూపాయల డీడీని మంగళవారం సీఎం సహాయ నిధి కోసం అందజేశారు. ‘గిఫ్ట్ ఏ స్మైల్’లో భాగంగా పేద ప్రజల వైద్య సేవల కోసం ఈ మొత్తాన్ని డీడీ రూపం లో సీఎం సహాయనిధికి జనార్దన్ ఇవ్వడం అభినందనీయమని కేటీఆర్ అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ వేదిక ప్రతినిధులు, సభ్యలు పాల్గొన్నారు.