సింగర్గా మారిన సీఎం
ABN , First Publish Date - 2021-08-12T21:09:19+05:30 IST
మధ్యప్రదేశ్: సీఎం సింగర్గా మారారు. తనలోని టాలెంట్ను బయటపెట్టారు.
మధ్యప్రదేశ్: సీఎం సింగర్గా మారారు. తనలోని టాలెంట్ను బయటపెట్టారు. రాజకీయాలు, ప్రజాపాలనతో ఎప్పుడూ బిజీగా ఉండే మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ గాయకుడిగా మారి పాటపాడారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయ్వర్గీయతో సీఎం పాడిన పాట సోషల్ మీడియాలో వైరల్గా మారింది. భోపాల్లోని అసెంబ్లీ ప్రాంగణంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఇరువురు నేతలు ప్రముఖ బాలీవుడ్ చిత్రం షోలేలోని ‘హే దోస్తీ హమ్ నహీ తోడేంగే’ పాటను తమ స్నేహానికి ప్రతీకగా పాడుకున్నారు.