సీఎం పర్యటన రూట్మ్యాప్ పరిశీలన
ABN , First Publish Date - 2021-06-18T05:37:09+05:30 IST
జిల్లా కేంద్రంలోని సమీకృత భవనం, ఎస్పీ భవనాల ప్రారంభోత్సవానికి ఈ నెల 20న ముఖ్యమంత్రి కేసీఆర్ వస్తున్నందున ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ఇందిరాగాంధీ స్టేడియంలో హెలిప్యాడ్ ల్యాండింగ్, రూట్మ్యాప్, రోడ్లను పరిశీలించారు.
కామారెడ్డి, జూన్ 17: జిల్లా కేంద్రంలోని సమీకృత భవనం, ఎస్పీ భవనాల ప్రారంభోత్సవానికి ఈ నెల 20న ముఖ్యమంత్రి కేసీఆర్ వస్తున్నందున ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ఇందిరాగాంధీ స్టేడియంలో హెలిప్యాడ్ ల్యాండింగ్, రూట్మ్యాప్, రోడ్లను పరిశీలించారు. అనంతరం కలెక్టర్ శరత్, ఎస్పీ శ్వేతారెడ్డిలతో ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన అన్ని అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ వెంకట మాధవరావు, ఆర్డీవో శ్రీను, నాయకులు నిట్టు వేణుగోపాల్రావు తదితరులు పాల్గొన్నారు.