14 రోజుల పాటు లాక్‌డౌన్ విధించండి : సీఎం ఉద్ధవ్‌తో టాస్క్‌ఫోర్స్ అధికారులు

ABN , First Publish Date - 2021-04-12T00:04:01+05:30 IST

కరోనా ఉధృతి నేపథ్యంలో ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే ఆదివారం కోవిడ్ టాస్క్‌ఫోర్స్ అధికారులతో సమావేశం నిర్వహించారు.

14 రోజుల పాటు లాక్‌డౌన్ విధించండి : సీఎం ఉద్ధవ్‌తో టాస్క్‌ఫోర్స్ అధికారులు

ముంబై : కరోనా ఉధృతి నేపథ్యంలో ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే ఆదివారం కోవిడ్ టాస్క్‌ఫోర్స్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న కోవిడ్ పరిస్థితి, లాక్‌డౌన్ విధింపు అంశాలపైనే ముఖ్యంగా చర్చించారు. అయితే రాష్ట్రంలో 14 రోజుల పాటు లాక్‌డౌన్ విధిస్తేనే పరిస్థితి అదుపులోకి వస్తుందని టాస్క్‌ఫోర్స్ అధికారులు సీఎం ఉద్ధవ్‌కు ప్రతిపాదించారు. మరికొందరు అధికారులు మాత్రం 8 రోజుల పాటు లాక్‌డౌన్ విధిస్తే సరిపోతుందని ప్రతిపాదించారు. లాక్‌డౌన్ విధిస్తే‌నే కరోనా చైన్‌ను తెంచవచ్చని అభిప్రాయపడ్డారు. అయితే ఉద్ధవ్ మాత్రం 4 రోజులు మాత్రమే లాక్‌డౌన్ విధిస్తే సరిపోతుందని అధికారులతో అన్నట్లు తెలుస్తోంది. ఈ భేటీ తర్వాతే సీఎం ఉద్ధవ్ లాక్‌డౌన్‌ను ప్రకటించే అవకాశాలున్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. 

Updated Date - 2021-04-12T00:04:01+05:30 IST