నిరుపేదలకు అండగా ఉంటాం
ABN , First Publish Date - 2020-12-04T05:23:40+05:30 IST
నిరుపేదలకు అండగా ఉంటాం
కీసర/ఘట్కేసర్: నిరుపేదలకు అండగా ఉంటామని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. కీసర మండల పరిధిలోని దాయర, తిమ్మాయిపల్లి, గోధుమకుంట గ్రామాలకు చెందిన శివరెడ్డి, లలిత, లావణ్యలకు ఇటీవల అనారోగ్యానికి గురి కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందారు. దీంతో ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేసుకోగా వారికి నిధులు మంజురయ్యాయి. ఈ మేరకు మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు సుధాకర్రెడ్డి ఆధ్వర్యంలో గురువారం మంత్రి మల్లారెడ్డి తన నివాసంలో లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్చైర్మన్ వెంకటేష్, ఎంపీపీ ఇందిర లక్ష్మీనారాయణ, ఉపాధ్యక్షుడు పర్వత్రెడ్డి పాల్గొన్నారు. అదేవిధంగా ఘట్కేసర్ పరిధి చౌదరిగూడ గ్రామానికి చెందిన లబ్ధిదారు దిలీప్కు సర్పంచ్ బైరు రమాదేవి రూ.14వేలు సీఎంఆర్ఎఫ్ చెక్కు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రాములు గౌడ్, పంచాయతీ సభ్యులు ఎం.స్వామిదాస్ పాల్గొన్నారు.