సీఎంఆర్ఎఫ్.. పేదలకు వరం
ABN , First Publish Date - 2021-10-18T04:27:20+05:30 IST
సీఎంఆర్ఎఫ్.. పేదలకు వరం
- మంత్రి చామకూర మల్లారెడ్డి
మేడ్చల్: సీఎం సహాయ నిధి పేద లకు వరమని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ మండలంలోని ఎల్లంపేట గ్రామానికి చెందిన పెద్దలింగంలక్ష్మి, మసారి శ్రీశైలం, చిన్నం బాలమణి అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా సీఎం రిలీఫ్ ఫండ్ కోసం దరఖాస్తు చేసుకోగా మంజూరైన చెక్కులను మంత్రి అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ పద్మజగన్రెడ్డి, సర్పంచ్ మేకల వెన్నల రామకృష్ణుడు, నాయకులు నర్సింగ్రావు, రాజశేఖర్, రమేష్, సురేష్, నవనీత, శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు.