కొవిడ్ నివారణకు సహకరించండి
ABN , First Publish Date - 2021-04-22T05:11:03+05:30 IST
కొవిడ్ వ్యాప్తి నివారణకు వర్తకులు సహకరించాలని ఆర్డీవో కిషోర్ కోరారు.
వ్యాపార సమయాన్ని కుదించుకోండి
ఆర్డీవో కిశోర్
గుజరాతీపేట, ఏప్రిల్ 21: కొవిడ్ వ్యాప్తి నివారణకు వర్తకులు సహకరించాలని ఆర్డీవో కిషోర్ కోరారు. బుధ వారం స్థానిక జడ్పీ సమావేశ మందిరంలో పట్టణంలోని వర్తకులతో నిర్వహించిన సమావేశంలో ఆర్డీవో మాట్లా డారు. జిల్లాలో సెకెండ్ వేవ్ కొవిడ్ కేసులు అధికంగా పెరు గుతున్నాయన్నారు. బుధవారం ఒక్కరోజే 1,444 కేసులు నమోదయ్యాయన్నారు. ఈ సమయంలో ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాల న్నారు. వర్తక, వాణిజ్య రంగాలు సహకరించి కేసులు తగ్గుదలకు ప్రయత్నం చేయాలన్నారు. వ్యాపార కార్యకలాపాలు నిర్వహించే సమయాన్ని కుదించు కోవాలని కోరారు. దుకాణాలకు వెళ్లే వినియోగదారులు విధిగా మాస్క్ ధరించాలని స్పష్టంచేశారు. కలెక్టర్ నివాస్ ఆధ్వర్యంలో గురువారం ఉదయం 10.30 గంటలకు వ్యా పార వర్గాలతో మరోసారి సమావేశం నిర్వహించనున్నట్లు ఆర్డీవో తెలిపారు.