Collectorate ఎదుట కుటుంబం ఆత్మహత్యాయత్నం
ABN , First Publish Date - 2021-11-23T16:24:25+05:30 IST
సేలం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యయత్నానికి పాల్పడిన సంఘటన సోమవారం కలకలం రేపింది. గంగవల్లి సమీపంలోని ఉలిపురం ప్రాంతానికి చెందిన మారియాయి
ప్యారీస్(చెన్నై): సేలం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యయత్నానికి పాల్పడిన సంఘటన సోమవారం కలకలం రేపింది. గంగవల్లి సమీపంలోని ఉలిపురం ప్రాంతానికి చెందిన మారియాయి తన కుటుంబసభ్యులతో కలసి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్దకు చేరుకొని తమ వెంట తీసుకొచ్చిన కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకొనేందుకు ప్రయత్నిస్తుండగా, అక్కడ ఉన్న పోలీసులు అడ్డుకున్నారు. తల్లి మరియాయి, కుమారుడు కుమార్, కుమార్ కుమారుడు, కుమార్తెలను పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి విచారణ జరుపగా, మారియాయి అదే ప్రాంతానికి చెందిన తంగవేల్ వద్ద గత 2005వ సంవత్సరం రెండున్నర ఎకరాల స్థలాన్ని రూ.1.65 లక్షలకు కొనుగోలు చేసిందని, ఈ భూములకు సంబంధించి తంగవేల్ తమ పట్ల దౌర్జన్యం ప్రదర్శించడం వల్ల విసుగు చెంది ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు మారియాయి తెలిపింది. వీటి ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు.