ఎండలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : కలెక్టర్‌

ABN , First Publish Date - 2020-05-26T05:30:00+05:30 IST

జిల్లాలో రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు పెరగనున్నాయని, అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ సి.హరికిరణ్‌ జిల్లా

ఎండలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : కలెక్టర్‌

కడప(కలెక్టరేట్‌), మే 25: జిల్లాలో రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు పెరగనున్నాయని, అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ సి.హరికిరణ్‌ జిల్లా ప్రజలకు ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. ఈనెల 23 నుంచి ఎండలు భగ్గుమనడంతో పాటు రాబోయే రోజుల్లో వడగాల్పులు కూడా వీచే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిందన్నారు. నీరు, మజ్జిగ, కొబ్బెర నీళ్లు లాంటివి ఎక్కువగా తీసుకోవాలన్నారు. అత్యవసరమైతే వైఎ్‌సఆర్‌ టెలీమెడిసిన్‌ వైద్య సేవలు టోల్‌ ఫ్రీ నెం.14410కు, టెలీ కన్సల్టెన్సీ కోసం 08562-244070కు ఫోన్‌ చేసి వైద్య సేవలు పొందవ చ్చన్నారు.

Updated Date - 2020-05-26T05:30:00+05:30 IST