సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు: కలెక్టర్
ABN , First Publish Date - 2020-06-05T11:05:25+05:30 IST
వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబల కుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ కృష్ణభాస్కర్ అధికారులను
సిరిసిల్ల కలెక్టరేట్, జూన్ 4: వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబల కుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ కృష్ణభాస్కర్ అధికారులను అదేశించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో గురువారం జాతీయ కీటన జనిత వ్యాధుల నియంత్రణ, సీజనల్ వ్యాధుల నివారణపై జిల్లా స మన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లా వైద్యాధికారి సుమన్ మోహన్రావు, డాక్టర్ శ్రీరాములు, జిల్లా పరిషత్ సీఈవో గౌతంరెడ్డి, డీఆర్ డీవో కౌటిల్యరెడ్డి, పోగ్రాం అఫీసర్లు డాక్టర్ మహేష్, డాక్టర్ అనిత, డీఈవో రాధాకిషన్, డీపీవో రవీందర్ తదితరులు పాల్గొన్నారు.