ఏసీ స్టేడియంలో 500 బెడ్లు సిద్ధం చేయాలి
ABN , First Publish Date - 2020-08-12T10:51:16+05:30 IST
కొవిడ్ బాధితుల కోసం నెల్లూరులోని ఏసీ స్టేడియంలో 500 బెడ్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని జీజీహెచ్ సూపరింటెండెంట్ ..
జీజీహెచ్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి
కలెక్టర్ చక్రధర్బాబు
నెల్లూరు(హరనాథఫురం), ఆగస్టు 11 : కొవిడ్ బాధితుల కోసం నెల్లూరులోని ఏసీ స్టేడియంలో 500 బెడ్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ సుధాకర్ రెడ్డిని కలెక్టర్ కేవీఎన్ చక్రధర్ బాబు ఆదేశించారు. ఆయన మంగళవారం క్యాంపు కార్యాలయంలో సూపరింటెండెంట్తో సమీక్షించారు. జీజీహెచ్లోని ప్రతి వార్డులో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయటంతోపాటు వాటిని జిల్లా ఎమర్జెన్సీ కేంద్రానికి అనుసంధానించాలని సూచించారు. బాధితులను డాక్టర్ చూడలేదు అనే ఫిర్యాదు రాకుండా వైద్య సేవలు అందించాలన్నారు. పారిశుధ్యం, భోజన వసతులు పటిష్టంగా చేపట్టాలన్నారు. బెడ్స్ కొరత రానివ్వొద్దని, అదనపు బెడ్ల కోసం ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు.