ప్రథమ చికిత్సకు అనుమతి ఇవ్వండి
ABN , First Publish Date - 2020-08-12T10:48:19+05:30 IST
జిల్లాలో గ్రామీణ వైద్యులు ప్రథమ చికిత్స చేసేందుకు అనుమతి ఇవ్వాలని పీఎంపీ అసోసియే షన్ కలెక్టర్ను కోరింది.
కలెక్టర్కు పీఎంపీల వినతి
నెల్లూరు (వైద్యం), ఆగస్టు 11 : జిల్లాలో గ్రామీణ వైద్యులు ప్రథమ చికిత్స చేసేందుకు అనుమతి ఇవ్వాలని పీఎంపీ అసోసియే షన్ కలెక్టర్ను కోరింది. ఈ మేరకు మంగళవారం క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ చక్రధర్బాబుకు నాయకులు వినతిపత్రం అందజేశారు. పీఎంపీ సంఘం జిల్లా అధ్యక్షుడు శాఖవరపు వేణుగోపాల్ మాట్లాడుతూ జిల్లాలో కరోనా కేసులు పెరుగుతుండటంతో గతనెలలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రఽథమ చికిత్స ఆపేశామన్నారు.
అయితే గ్రామాల్లో వైద్యం చేయాలని స్థానికులు ఒత్తిడి చేస్తున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో కరోనా లక్షణాలు లేని వారికి వైద్యం అందించేలా అనుమతి ఇవ్వాలని కోరారు. దీనికి కలెక్టర్ పరిశీలించి తగిన న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో షేక్ సత్తార్, దేవరకొండ శ్రీనివాసులు, రామదాసు, శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.