కనీస వేతనాలను ప్రకటించిన కలెక్టర్
ABN , First Publish Date - 2021-08-03T07:28:24+05:30 IST
కనీస వేతనాలను కలెక్టర్ హరినారాయణన్ ప్రకటించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశపు హాలులో రోజువారీ వేతనాలపై సమావేశం నిర్వహించారు.
చిత్తూరు, ఆగస్టు 2: కనీస వేతనాలను కలెక్టర్ హరినారాయణన్ ప్రకటించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశపు హాలులో రోజువారీ వేతనాలపై సమావేశం నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల్లో.. అన్స్కిల్డ్ కూలీలకు రోజు వారీగా.. రూ.423 నుంచి రూ.465 వరకు, సెమీ స్కిల్డ్ వారికి రూ.444 నుంచి రూ.488 వరకు, స్కిల్డ్ వర్కర్లకు రూ.466 నుంచి రూ.513కు పెంచడం జరిగిందన్నారు. మున్సిపల్ ప్రాంతాల్లో.. అన్స్కిల్డ్ కూలీలకు రోజు వారీగా.. రూ.487 నుంచి రూ.536, సెమీ స్కిల్డ్ వారికి రూ.512 నుంచి రూ.563, స్కిల్డ్ వర్కర్లకు రూ.588 నుంచి రూ.647కు పెంచారు. కార్మికశాఖ డిప్యూటీ కమిషనర్ బాలునాయక్, డీఎఫ్వో నరేందిరన్, ఆర్డీవో రేణుక, తదితరులు పాల్గొన్నారు.