కలెక్టర్తో ఉపాధి హామీ జాతీయ బృందం భేటీ
ABN , First Publish Date - 2022-01-23T04:50:21+05:30 IST
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ, ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద జిల్లాలో చేపట్టిన పనులు సంతృప్తికరంగా ఉన్నాయని జాతీయస్థాయి బృందం పేర్కొన్నది.
గుంటూరు, జనవరి 22 (ఆంధ్రజ్యోతి): మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ, ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద జిల్లాలో చేపట్టిన పనులు సంతృప్తికరంగా ఉన్నాయని జాతీయస్థాయి బృందం పేర్కొన్నది. శనివారం ఆ బృంద సభ్యులైన వినయ్ గారడే, అనిల్ గైక్వాడ్ కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ వివేక్యాదవ్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాము ఈ నెల 14వ తేదీ నుంచి శనివారం వరకు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించి పీఎంఏవై పథకం కింద చేపట్టిన పనులను తనిఖీ చేశామన్నారు. సమావేశంలో డ్వామా పీడీ డాక్టర్ ఎం.యుగంధర్కుమార్, పంచాయతీరాజ్ ఎస్ఈ జి.బ్రహ్మయ్య, హౌసింగ్ అధికారులు పాల్గొన్నారు.