కోవిడ్ పాజిటివ్ అయినా పరీక్షలు రాయవచ్చు: కలెక్టర్ ముత్యాలరాజు

ABN , First Publish Date - 2020-09-24T16:37:47+05:30 IST

ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లాలో సచివాలయ పరీక్షా ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు మీడియాకు వెల్లడించారు.

కోవిడ్ పాజిటివ్ అయినా పరీక్షలు రాయవచ్చు: కలెక్టర్ ముత్యాలరాజు

ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లాలో సచివాలయ పరీక్షా ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు మీడియాకు వెల్లడించారు. జిల్లాలో వీఆర్వో మినహా 18 కేటగిరీలలో సచివాలయ పోస్టులను భర్తీ చేస్తున్నామన్నారు. మొత్తం 1045 పోస్టులకు 74,711 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారన్నారు. 96 ప్రయివేట్, 26 ప్రభుత్వ భవనాల్లో మొత్తం 122 సెంటర్లలో పరీక్షలకు ఏర్పాట్లు చేశామన్నారు. కోవిడ్ రిపోర్ట్ లేకపోయినా, కోవిడ్ పాజిటివ్ అయినా పరీక్షలు రాయవచ్చన్నారు. థర్మల్ స్కాన్, మెడికల్ కిట్లు అవసరమైన చోట పీపీఈ కిట్లు సిద్ధం చేశామన్నారు. అనారోగ్య లక్షణాలు ఉన్నవారికి ప్రత్యేక ఐసోలేషన్ రూమ్‌లు సిద్ధం చేశామన్నారు. 2 గంటల ముందు నుంచి పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తామని కలెక్టర్ ముత్యాలరాజు వెల్లడించారు.

Updated Date - 2020-09-24T16:37:47+05:30 IST