మొక్కలను రక్షించండి : కలెక్టర్
ABN , First Publish Date - 2020-07-09T10:31:00+05:30 IST
హరితహారంలో నాటిన మొక్కలను రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందని కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు.
మోపాల్, జూలై 8: హరితహారంలో నాటిన మొక్కలను రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందని కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. బుధవారం బోర్గాం (పి), ఠానాకుర్దు, మోపాల్, కాస్బాగ్తండా, మంచిప్ప గ్రామాలను కలెక్టర్ సందర్శించారు. గ్రామాల్లో నాటిన మొక్కలను పరిశీలించారు. నాటిన మొక్కలకు నీరు పోయాలన్నారు. గ్రామాల్లో జరుగుతున్న శ్మశానవాటిక పనులను పరిశీలించారు. మార్గమధ్యలో ఉన్న శ్మశానవాటిక పనులను త్వరగా పూర్తయ్యే విధంగా చూడాలని కిందిస్థాయి అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ వీర్సింగ్, ఎంపీడీవో మల్లేశం, కార్పొరేటర్ సౌజన్య, నగర మేయర్ నీతూ కిరణ్, నగర కమిషనర్ జితేష్ వి పాటిల్, ఆయా గ్రామాల సర్పంచులు రవి, విజయ లత, ఎంపీటీసీలు పాల్గొన్నారు.