శాశ్వత గృహ హక్కు పథకంపై అవగాహన కల్పించండి: కలెక్టర్
ABN , First Publish Date - 2021-10-23T06:36:28+05:30 IST
శాశ్వత గృహ హక్కు పథకంపై అవగాహన కల్పించండి: కలెక్టర్
విస్సన్నపేట, అక్టోబరు 22: జగనన్న శాశ్వత గృహ హక్కు పథకంపై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను కలెక్టర్ జె.నివాస్ ఆదేశించారు. శుక్రవారం వైఎస్సార్ క్రాంతిపథం కార్యాలయంలో జగనన్న శాశ్వత గృహ హక్కు పథకం ప్రగతి, అమలు తీరుపై అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. అధికారులు, వలంటీర్లు ఈ పథకంపై ప్రజలకున్న సందేహాలను నివృత్తి చేయాలన్నారు. లబ్ధిదారురాలు దోసపాటి పార్వతి నివాసానికి వెళ్లి పథకంపై అవగాహన కల్పించారు. ఫీవర్ సర్వే పక్కాగా నిర్వహించాలని ఆదేశించారు. సచివాలయాన్ని తనిఖీ చేశారు. తహసీల్దార్ మురళీకృష్ణ, ఎంపీడీవో ఎస్.వెంకట రమణ, హౌసింగ్శాఖ అధికారులు పాల్గొన్నారు.