రైతు బజార్ను మూయించిన కలెక్టర్
ABN , First Publish Date - 2020-03-24T12:49:32+05:30 IST
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కఠి న చర్యలు తీసుకోవాలని, ఎలాంటి జన సంచారం ఉండకూడదని రాష్ట్ర ప్రభుత్వ
ఆదిలాబాద్టౌన్, మార్చి23: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కఠి న చర్యలు తీసుకోవాలని, ఎలాంటి జన సంచారం ఉండకూడదని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలమేరకు ఉదయం నుంచి కొనసాగుతున్న రైతుబజా ర్ను, పరిసర ప్రాంతాల్లోని వ్యాపార సముదాయాలను సాయంత్రం కలెక్టర్ దేవసేన సందర్శించి బంద్ చేయించారు. జనసందోహాం ఎ క్కువగా ఉండవద్దని, దీంతో వైరస్వ్యాప్తి చెందే ప్రమాదం ఉంటుందని ఆమె సూచించారు.
సాయంత్రం కొనసాగిన వ్యాపార సముదాయాలన్ని ంటిని వెంటనే మూసి వేయాలని ఎలాంటి విక్రయాలు జరుపకూడదని ఆమె ఆదేశించారు. అక్కడే ఉండి సముదాయాలను మూసి వేయించిన ఆమె కరోనావైరస్ నివారణకు చేపట్టే చర్యల్లో ప్రజలు సహకరించాలని వైరస్ వ్యాప్తి చెందకుండా చూడాలన్నారు. ఎవరైనా నిబంధనలు అతిక్ర మిస్తే చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.