అధిక ఫీజుల వసూలుపై ఆందోళన

ABN , First Publish Date - 2020-11-28T06:16:27+05:30 IST

అధిక ఫీజుల వసూలుపై ఆందోళన

అధిక ఫీజుల వసూలుపై ఆందోళన
కాలేజీ ఎదుట ఆందోళన చేస్తున్న విద్యార్థులు, తల్లిదండ్రులు

ఉంగుటూరు,నవంబరు 27 : అధిక ఫీజులు వసూలు చేస్తున్నారంటూ తేలప్రోలులోని వైజాగ్‌ డిఫెన్స్‌ అకాడమీ ఎదుట విద్యార్థులు, తల్లిదండ్రులు శుక్రవారం ఆందోళన చేశారు. వైజాగ్‌ డిఫెన్స్‌ అకాడమీ పేరుమీద అడ్మిషన్లు ఇచ్చి, వైజాగ్‌  జూనియర్‌ కాలేజ్‌ అని టీసీలు ఇస్తు న్నారని, ఇంటర్‌ రెండేళ్లలో డిఫెన్స్‌లో శిక్షణ ఇస్తామని చెప్పి జూనియర్‌ ఇంటర్‌ ఫీజు సుమారు రూ.1.40లక్షలు వసూలు చేశారని ఎలాంటి శిక్షణ ఇవ్వలేదని తల్లిదండ్రులు ఆరోపించారు.  ఈ విషయమై  విద్యార్థుల తల్లిదండ్రులు ఆత్కూరు పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేశారు.  

Updated Date - 2020-11-28T06:16:27+05:30 IST