రంగుమారిన శనగలు క్వింటా రూ.4,500
ABN , First Publish Date - 2021-04-21T09:51:33+05:30 IST
అకాల వర్షాలకు తడిసి, రంగు మారిన శనగలకు క్వింటా రూ.4,500 చొప్పున కనీస మద్దతు ధరను రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
అమరావతి, ఏప్రిల్ 20(ఆంధ్రజ్యోతి): అకాల వర్షాలకు తడిసి, రంగు మారిన శనగలకు క్వింటా రూ.4,500 చొప్పున కనీస మద్దతు ధరను రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. కడప జిల్లా పులివెందుల, కమలాపురం, జమ్మలమడుగు ప్రాంతాల్లో అకాల వర్షాలకు శనగలు 3-15 శాతం రంగు మారి, నల్లబడినట్లు మార్కెటింగ్శాఖ అధికారుల కమిటీ గుర్తించింది. తడిసిన శనగల కొనుగోలుకు కమిటీ సిఫారసు మేరకు ప్రభుత్వం క్వింటా రూ.4,500గా కనీస మద్దతు ధరను ఖరారు చేసింది. అయితే రబీ శనగలకు కేంద్రం రూ.5,100 కనీస మద్దతు ధరగా ప్రకటించింది.