తీరంలో రంగుల హరివిల్లు..
ABN , First Publish Date - 2021-05-17T04:26:18+05:30 IST
సాగరతీరంలో ఆదివారం మధ్యాహ్నం రంగుల హరివిల్లు కనువిందు చేసింది.
బీచ్రోడ్డు, మే 16: సాగరతీరంలో ఆదివారం మధ్యాహ్నం రంగుల హరివిల్లు కనువిందు చేసింది. అయితే కర్ఫ్యూ నేపథ్యంలో ఆర్కే బీచ్ వద్ద గగనతలంపై విరిసిన ఇంద్రధనుస్సును అతికొద్ది మాత్రమే వీక్షించగలిగారు. తీర ప్రాంతంలో నివసిస్తున్న వారు ఇంద్రధనస్సును ఆసక్తిగా తిలకించి ఆ సుందర దృశ్యాన్ని తమ సెల్ ఫోన్లలో బంధించారు.