పీఆర్సీ జీవోల దహనం
ABN , First Publish Date - 2022-01-19T04:50:26+05:30 IST
రాజంపేట ఎమ్మార్సీ భవనం వద్ద మంగళవారం ప్యాప్టో నాయకులు పీఆర్సీ జీవోలను దహనం చేశారు.
రాజంపేట, జనవరి 18 : రాజంపేట ఎమ్మార్సీ భవనం వద్ద మంగళవారం ప్యాప్టో నాయకులు పీఆర్సీ జీవోలను దహనం చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై నిరసన వ్యక్తం చేశారు. ప్రభు త్వం పీఆర్సీపై వేసిన అశోక్ మిశ్రా కమిటీ నివేదికను బయ టపెట్టకుండా అన్యాయంగా, అశాస్త్రీయమైన సీఎస్ కమిటీ నివేదికను తెరపైకి తెచ్చి ఉద్యోగుల కడుపు మండేలా 23 శాతం ఫిట్మెంట్ను ప్రకటించడం దారుణమన్నారు. రాజంపేట ప్యాప్టో నాయకులు వై.సుబ్రహ్మణ్యంరాజు, ఎన్.సత్యనారాయణ, పెన్షన్ల సంఘం అధ్యక్షుడు ఆదిశేషారెడ్డి, ఎన్జీవో అధ్యక్షుడు రమణ, టీచర్ల సంఘం నేతలు పాల్గొన్నారు.
రైల్వేకోడూరులో...
రైల్వేకోడూరు, జనవరి 18: రైల్వేకోడూరు ఎంఆర్సీ భవనం ఆవరణలో ప్యాప్టో ఆధ్వర్యంలో మంగళవారం ఎస్టీయూ, యూటీఎఫ్ సంఘాలకు చెందిన ఉపాధ్యాయులు పీఆర్సీ జీవో ప్రతులను దహనం చేశారు. ఈ సందర్భంగా ప్యాప్టో నేతలు మాట్లాడుతూ వై.రామక్రిష్ణయాదవ్, బీదం సుబ్బరాయుడు మాట్లాడుతూ ప్రభుత్వం రాత్రికిరాత్రే పీఆర్సీ జీవోలను విడుదల చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. పాత పీఆర్సీని కొనసాగించాలన్నారు. సీపీఎస్ విధానం రద్దు చేయాలన్నారు. సచివాలయం ఉద్యోగులకు మినిమమ్ స్కేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.