అభివృద్ధిపై చర్చకు రావాలి: స్పీకర్‌

ABN , First Publish Date - 2022-01-23T04:42:22+05:30 IST

తాను ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి నియోజకవర్గ అభివృద్ధిపై చర్చకు రాగలరా అని ప్రతిపక్ష నాయకులకు స్పీకర్‌ తమ్మినేని సీతారాం సవాల్‌ విసిరారు.

అభివృద్ధిపై చర్చకు రావాలి: స్పీకర్‌
విద్యార్థులతో మాట్లాడుతున్న సీతారాం :


ఆమదాలవలస: తాను ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి   నియోజకవర్గ అభివృద్ధిపై చర్చకు రాగలరా అని  ప్రతిపక్ష నాయకులకు  స్పీకర్‌ తమ్మినేని సీతారాం సవాల్‌ విసిరారు. శనివారం తోటాడ పాఠశాలలో రూ.18 లక్షలతో చేపట్టిన  నాడు-నేడు పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొంతమంది విపక్ష నాయకులు  అభివృద్ధి జరగలేదని విమర్శిస్తున్నారని,  వారికి అభివృద్ధి కనిపించ డంలేదా లేదా అని ప్రశ్నించారు.   పువ్వులతోట పేరుతో ప్రభుత్వ భూములు కాజేసేందుకు యత్నించడం అభివృద్ధా అని విమర్శించారు.విమర్శకు ప్రతి విమర్శ సరికాదన్నారు. తాను ఇన్నాళ్లు ఓపిక పట్టానని, ఎవరు ఏమిటో ప్రజలకు తెలుసని చెప్పారు.కంఠంలో ప్రాణం ఉన్నంత వరకూ విలువలతో కూడుకున్న, అవినీతికి తావులేకుండా న్యాయంకోసం ఆదర్శవంతమైన పరిపాలన చేస్తానన్నారు.  కార్యక్రమంలో నాయకులు తమ్మినేని నాని, శ్రీరామమూర్తి,తాండ్ర లక్ష్మి, జి.నీలారావు పాల్గొన్నారు.



 


Updated Date - 2022-01-23T04:42:22+05:30 IST