వాళ్లు కూడా నా పిల్లలే... థర్టీ ఇయర్స్ పృథ్వీరాజ్

ABN , First Publish Date - 2021-07-29T22:19:35+05:30 IST

వాళ్లు కూడా నా పిల్లలే... థర్టీ ఇయర్స్ పృథ్వీరాజ్

వాళ్లు కూడా నా పిల్లలే... థర్టీ ఇయర్స్ పృథ్వీరాజ్

అనంతపురం: హాస్యనటుడు, ఎస్వీబీసీ ఛానెల్ మాజీ చైర్మన్ పృథ్వీరాజ్ జిల్లాలో పర్యటించారు. కళ్యాణదుర్గం మండలం తిమ్మగానిపల్లిలో గొల్ల నారాయణ యాదవ్ (మిలటరీ నారాయణ) ఇటీవల మృతి చెందారు. దీంతో నారాయణ కుటుంబ సభ్యులను పృథ్వీరాజ్ పరామర్శించారు. మిలటరీ నారాయణకు భార్య లలిత, ఇద్దరూ కూతుళ్లు తేజస్విని, కూతురు దివ్య, కుమారుడు తరుణ్ కుమార్ ఉన్నారు. పెద్ద కూతురు తేజస్విని 2014 నుంచి ఫిలిమ్ ఇండస్ట్రీలో పనిచేస్తున్నారు. రెండవ కూతురు బ్రహ్మసముద్రం మండలం పడమటి కోడిపల్లి సచివాలయంలో సర్వేయర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. కొడుకు డిప్లొమో చేసి పెనుగొండ కియా పరిశ్రమలో ఉద్యోగి చేస్తున్నారు. తండ్రి మృతితో ప్రస్తుతం తరుణ్ ఇంటివద్దనే ఉంటున్నారు.


నారాయణ పెద్ద కుమార్తె తేజస్విని హైదరాబాద్‌లో పృథ్వీరాజ్ ఫ్యామిలీతో కలిసి ఉంటున్నారు. మిలటరీ నారాయణ అంత్యక్రియలకు వెళ్లలేకపోవడంతో పృథ్వీరాజ్ ఈ రోజు ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారికి మనోధైర్యం కల్పించారు. నారాయణ పిల్లలు కూడా తన బిడ్డలతో సమానమన్నారు. నారాయణ పిల్లలు మంచి పొజిషన్‌కి వెళ్లేందుకు తన వంతు సాయం చేస్తానని పృథ్వీరాజ్ భరోసా ఇచ్చారు. అంతకుముందు నారాయణ సమాధి వద్ద సంతాపాన్ని తెలియజేశారు. 


Updated Date - 2021-07-29T22:19:35+05:30 IST