‘ఖని’ ఆసుపత్రిలో ఆక్సిజన్‌ ప్లాంట్‌ పనుల ప్రారంభం

ABN , First Publish Date - 2021-05-09T05:20:31+05:30 IST

గోదావరిఖని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో కరోనా బాధితుల కోసం ఏర్పాటు చేసిన ఐసోలేషన్‌ వార్డుకు కావాల్సిన ఆక్సిజన్‌ ప్లాంట్‌ నిర్మాణ పనులకు శనివారం శ్రీకారం చుట్టారు.

‘ఖని’ ఆసుపత్రిలో ఆక్సిజన్‌ ప్లాంట్‌ పనుల ప్రారంభం
ఆక్సిజన్‌ ప్లాంట్‌ నిర్మాణం కోసం మార్కింగ్‌ చేస్తున్న సిబ్బంది

కళ్యాణ్‌నగర్‌, మే 8: గోదావరిఖని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో కరోనా బాధితుల కోసం ఏర్పాటు చేసిన ఐసోలేషన్‌ వార్డుకు కావాల్సిన ఆక్సిజన్‌ ప్లాంట్‌ నిర్మాణ పనులకు శనివారం శ్రీకారం చుట్టారు. ఆసుపత్రి వెనుక భాగంలో ప్లాంట్‌ ఏర్పాటు చేయడానికి నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా ప్రాజెక్టు డైరెక్టర్‌ మే 4న ఆసుపత్రిని సందర్శించి స్థల పరిశీలన చేశారు. కాగా శనివారం పనులను ప్రారంభించారు. నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా ఇంజనీర్‌ అదానిబాబు ప్లాంట్‌కు కావాల్సిన పరికరాలు, ఆక్సిజన్‌ తయారీ యంత్రాలను బిగించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. వారం రోజుల్లో ఈ ప్లాంట్‌ ప్రారంభమవుతుందని తెలిపా రు. నిమిషానికి 500లీటర్ల ఆక్సిజన్‌ను సప్లై చేసే ఈ ప్లాం ట్‌ ఇక్కడ రోజుకు 250మంది కరోనా బాధితులకు కావాల్సి న ఆక్సిజన్‌ను అందించవచ్చు.  

Updated Date - 2021-05-09T05:20:31+05:30 IST