కమర్షియల్ గ్యాస్... ధర పెరిగింది...

ABN , First Publish Date - 2021-12-01T21:48:00+05:30 IST

కమర్షియల్ లిక్విఫైడ్ పెట్రోలియం స్(ఎల్‌పీజీ) సిలిండర్ ధరలు భారీగా పెరిగాయి.

కమర్షియల్ గ్యాస్... ధర పెరిగింది...

న్యూఢిల్లీ : కమర్షియల్ లిక్విఫైడ్ పెట్రోలియం స్(ఎల్‌పీజీ) సిలిండర్ ధరలు భారీగా పెరిగాయి. పంతొమ్మిది కిలోల కమర్షియల్ సిలిండర్ ధర ఈ రోజు(డిసెంబరు ఒకటి, బుధవారం) నుండి రూ. 103.50   పెరిగింది.  ఈ కేటగిరీకి చెందిన ఎల్‌పీజీ వంటగ్యాస్‌ ధరల పెరుగుదల నెల రోజుల వ్యవధిలో ఇది రెండోసారి. గతనెల ఒకటిన కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్లపై రూ. 266 పెరిగిన విషయం తెలిసిందే. ఈ నెల మరో రూ. 103.50 పెంచింది. తాజా ధరల పెంపు అనంతరం కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ ధర దేశ రాజధాని ఢిల్లీలో రూ. 2,101, ముంబైలో రూ. 2,051, కోల్‌కతాలో రూ. 2,174.50, , చెన్నైలో రూ. 2,234.50 కి పెరిగింది. అంతకుముందు నవంబరు ఒకటో తేదీన కమర్షియల్ సిలిండర్ ధర పెరిగింది. అంతకుముందు అక్టోబరు 15 న పెరిగింది.


కాగా... 14.2 కిలోలు, 5 కిలోల డొమెస్టిక్ సిలిండర్ ధరలు మాత్రం స్థిరంగానే ఉన్నాయి. అంటే... గృహ వినియోగదారులకు తాజా భారం  నుంచి మినహాయింపు లభించినట్లైంది. గృహావసరాల కోసం వినియోగించే ఎల్‌పీజీ సిలిండర్ల రేట్లను యధాతథంగా కొనసాగిస్తోంది. పెంచిన రేట్లు ఈ తెల్లవారు జామున 6 గంటల నుంచి అమల్లోకొచ్చాయి. ఈ రెండు నెలల కాలంలో 19 కిలోల వంటగ్యాస్‌ సిలిండర్‌పై రూ. 369.50 పెరిగింది. ఈ ఏడాది మొదట్లో రూ. 694 గా ఉన్న గృహావసర ఎల్‌పీజీ వంటగ్యాస్ సిలిండర్ ధర ఇప్పుడు రూ. 900 మార్క్‌ను దాటింది. కాగా... ఈ నెల 6వ తేదీన డొమెస్టిక్ ఎల్‌పీజీ గ్యాస్ కనెక్షన్ల ధరలను పెంచే అవకాశముందని వినవస్తోంది. 

Updated Date - 2021-12-01T21:48:00+05:30 IST