ప్రజా సమస్యలు పరిష్కరించాలి
ABN , First Publish Date - 2021-10-22T05:19:17+05:30 IST
సచివాలయ కార్యదర్శులు ప్రజా సమస్యలను పరిష్కరించాలని నగర పాలక సంస్థ కమిషనర్ అనూరాధ తెలిపారు.
సచివాలయ కార్యదర్శులతో కమిషనర్ అనూరాధ
గుంటూరు(కార్పొరేషన్), అక్టోబరు 21: సచివాలయ కార్యదర్శులు ప్రజా సమస్యలను పరిష్కరించాలని నగర పాలక సంస్థ కమిషనర్ అనూరాధ తెలిపారు. గురువారం నగర పర్యటనలో భాగంగా నవభారత్ నగర్, పలకలూరురోడ్డు తదితర ప్రాంతాలలో పర్యటించారు. అభివృద్ధి, పారిశుఽధ్య పనులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి రోజు ఉదయం 7 నుంచి 8 గంటల మధ్య పర్యావరణ, ఎమినిటీ, ప్లానింగ్ కార్యదర్శులు సంయుక్తంగా వార్డుల్లో పర్యటించి ప్రజాసమస్యలను నమోదు చేసుకోవాలన్నారు. సచివాలయం 110 పరిధిలో పారిశుధ్యం అధ్వానంగా ఉందని, తడి పొడి వ్యర్థాలు సేకరించడంలో నిర్లక్ష్యంగా ఉన్నారని పర్యావరణ కార్యదర్శిని సస్పెండ్ చేసి ప్లానింగ్ కార్యదర్శులకు నోటీసులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు.