కార్పొరేషన్ ఎన్నికలకు సర్వం సిద్ధం చేస్తున్నాం : కమిషనర్
ABN , First Publish Date - 2021-10-24T03:26:48+05:30 IST
రానున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సర్వం సిద్ధం చేస్తున్నామని ఎన్ఎంసీ కమిషనర్ కే దినే్షకుమార్ తెలిపారు.
నెల్లూరు(సిటీ), అక్టోబరు 23 : రానున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సర్వం సిద్ధం చేస్తున్నామని ఎన్ఎంసీ కమిషనర్ కే దినే్షకుమార్ తెలిపారు. శనివారం మున్సిపల్ అధికారులతో కలిసి ఆయన డీకేడబ్ల్యూ కళాశాలలో పోలింగ్, కౌటింగ్లకు సంబఽంధించి సౌకర్యాలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్నికలకు త్వరలో నోటిఫికేషన్ వెలువడునున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కొవిడ్ నిబంధనలను పరిగణలోకి తీసుకుని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ రాజేంద్రప్రసాద్, రెవెన్యూ సూపరింటెండెంట్ బాలక్రిష్ణ, ఈఈ, సిటీప్లానింగ్ అధికారులు పాల్గొన్నారు.