చర్చలకు ఒక్క రోజు ముందు కీలక ప్రకటన చేసిన చైనా

ABN , First Publish Date - 2020-06-05T21:12:12+05:30 IST

రిహద్దు సమస్యలపై శనివారం జరగనున్న మిలటరీ స్థాయి అధికారుల సమావేశానికి ఒక రోజు ముందు చైనా ఈ

చర్చలకు ఒక్క రోజు ముందు కీలక ప్రకటన చేసిన చైనా

న్యూఢిల్లీ : భారత్, చైనా మధ్య నెలకొన్న లడఖ్ ప్రతిష్టంభనను పరిష్కరించడానికి తాము చిత్తశుద్ధితో ఉన్నామని శుక్రవారం చైనా ప్రకటించింది. సరిహద్దు సమస్యలపై శనివారం జరగనున్న మిలటరీ స్థాయి అధికారుల సమావేశానికి ఒక రోజు ముందు చైనా ఈ ప్రకటనను వెలువరించింది. ‘‘ప్రస్తుతం భారత్, చైనా సరిహద్దుల్లో పరిస్థితి మాత్రం స్థిరంగా, అదుపులోనే ఉంది’’ అని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జెంగ్ షువాంగ్ తెలిపారు.


‘‘మాకు పూర్తి స్థాయిలో సరిహద్దు సంబంధిత యంత్రాగం ఉంది. మిలటరీ, దౌత్యపరమైన మాధ్యమాలున్నా, తాము మాత్రం... ఎప్పటికప్పుడు సమాచారాన్ని చేరవేస్తూనే ఉన్నాం. సరిహద్దు సమస్యను పరిష్కరించడానికి తాము చిత్తశుద్ధితో పరిష్కరించుకోడానికి కట్టుబడి ఉన్నాం’’ అని ఆయన ప్రకటించారు. 

Updated Date - 2020-06-05T21:12:12+05:30 IST