విశాఖలో పోలీసింగ్‌ బలోపేతంపై ఉన్నతాధికారుల కమిటీ భేటీ

ABN , First Publish Date - 2020-08-13T11:18:03+05:30 IST

రాష్ట్ర పరిపాలన రాజధానిగా మారితే విశాఖలో పోలీసింగ్‌ను బలోపేతం చేయడం కోసం తీసుకోవాల్సిన చర్యలపై సీపీ ఆర్కేమీనా

విశాఖలో పోలీసింగ్‌ బలోపేతంపై ఉన్నతాధికారుల కమిటీ భేటీ

విశాఖపట్నం, ఆగస్టు 12(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర పరిపాలన రాజధానిగా మారితే విశాఖలో పోలీసింగ్‌ను బలోపేతం చేయడం కోసం తీసుకోవాల్సిన చర్యలపై సీపీ ఆర్కేమీనా అధ్యక్షతన ఇద్దరు ఐజీలు, ముగ్గురు డీఐజీల ఆధ్వర్యంలోని కమిటీ బుధవారం భేటీ అయింది. ఈ సందర్భంగా నగరంలో సీసీ కెమెరాల పెంపు, ట్రాఫిక్‌ నియంత్రణ, ముఖ్యమైన కూడళ్ల విస్తరణ, పోలీస్‌స్టేషన్లు పెంపు, అధికారులు, సిబ్బంది పెంపు వంటి అంశాలపై కమిటీ చర్చించినట్టు తెలిసింది. కమిటీ మరోసారి భేటీ కావాలని నిర్ణయించినట్టు సమాచారం. ఈ భేటీలో ఐజీలు మహేష్‌చంద్రలడ్డా, శ్రీకాంత్‌, డీఐజీలు రంగారావు, నాగేంద్రకుమార్‌, మురళీకృష్ణ పాల్గొన్నారు. 

Updated Date - 2020-08-13T11:18:03+05:30 IST