Communal sloganeering:బీజేపీ నేతతోపాటు ముగ్గురిని ప్రశ్నిస్తున్న పోలీసులు
ABN , First Publish Date - 2021-08-10T15:13:02+05:30 IST
జంతర్మంతర్ వద్ద ముస్లింలకు వ్యతిరేకంగా నినాదాలు చేసిన కేసులో నిందితులైన బీజేపీ నేత అశ్విని ఉపాధ్యాయతో పాటు మరో ముగ్గురిని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు....
న్యూఢిల్లీ : జంతర్మంతర్ వద్ద ముస్లింలకు వ్యతిరేకంగా నినాదాలు చేసిన కేసులో నిందితులైన బీజేపీ నేత అశ్విని ఉపాధ్యాయతో పాటు మరో ముగ్గురిని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముస్లింలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నేపథ్యంలో ఈ కేసులో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఢిల్లీ పోలీసు కమిషనర్ రాకేశ్ ఆస్థానా పోలీసులను ఆదేశించారు. దీంతో పోలీసులు బీజేపీ నేత అశ్విని ఉపాధ్యాయ్ ను కన్నాట్ ప్లేస్ పోలీసుస్టేషనుకు పిలిచి విచారిస్తున్నారు. అతనితో పాటు వినీత్ క్రాంతి, పింకీ భయ్యాలను పోలీసులు ప్రశ్నిస్తున్నారు.
న్యాయవాది, బీజేపీ మాజీ అధికార ప్రతినిధి అశ్విని ఉపాధ్యాయ నాయకత్వంలో జంతర్ మంతర్ వద్ద నిరసన చేపట్టినట్లు భారత్ జోడో ఆందోళన్ చేసింది. అయితే,ఈ ఆందోళనలో మతపరమైన నినాదాలు చేశారు. కాగా ముస్లింలకు వ్యతిరేకంగా నినాదాలు చేసినవారితో తమకు ఎటువంటి సంబంధంలేదని బీజేఏ మీడియా ఇన్చార్జి షిప్రా శ్రీవాత్సవ చెప్పారు. 222 బ్రిటీష్ చట్టాలను రద్దుచేయాలంటూ తాము ప్రదర్శన జరిపామన్నారు.