రుషికొండ బీచ్‌లో యువకుడిని రక్షించిన కమ్యూనిటీ గార్డులు

ABN , First Publish Date - 2021-12-08T05:03:41+05:30 IST

రుషికొండ బీచ్‌లో అలల ఉధృతికి కొట్టుకుపోతున్న ఓ యువకుడిని మంగళవారం కమ్యూనిటీ గార్డులు రక్షించడంతో ప్రాణాపాయం తప్పింది.

రుషికొండ బీచ్‌లో యువకుడిని రక్షించిన కమ్యూనిటీ గార్డులు
యువకుడిని ఒడ్డుకు తెస్తున్న కమ్యూనిటీ గార్డు

సాగర్‌నగర్‌, డిసెంబరు 7: రుషికొండ బీచ్‌లో అలల ఉధృతికి కొట్టుకుపోతున్న ఓ యువకుడిని మంగళవారం కమ్యూనిటీ గార్డులు రక్షించడంతో ప్రాణాపాయం తప్పింది. వివరాలిలా ఉన్నాయి. విజయనగరం నుంచి ఏడుగురు యువకులు రుషికొండ బీచ్‌కు విహారానికి వచ్చారు. వీరంతా సరదాగా సముద్ర స్నానాలకు దిగారు. అయితే అలల ఉధృతి అధికంగా వుండడంతో శ్యామ్‌ప్రసాద్‌ అనే యువకుడు సముద్రంలోకి కొట్టుకుపోతుండడాన్ని సమీపంలో వున్న కమ్యూనిటీ గార్డులు కె.రాజు, టి.ఎల్లాజీలు గుర్తించారు. తక్షణమే వారు సముద్రంలోకి వెళ్లి శ్యామ్‌ప్రసాద్‌ను కాపాడి మెరైన్‌ పోలీసులకు అప్పగించారు. ఆ యువకులకు మెరైన్‌ పోలీసులు కౌన్సెలింగ్‌ ఇచ్చి విడిచిపెట్టారు.


Updated Date - 2021-12-08T05:03:41+05:30 IST