ఉద్యోగ అవకాశం కల్పించాలి
ABN , First Publish Date - 2021-01-26T06:38:25+05:30 IST
విజయలక్ష్మి కుటుంబంలో ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పించాలని కోరుతూ స్థానిక ఆశ వర్కర్లు సీఐటీయూ ఆధ్వర్యంలో అధికారులను కలిసి వినతిపత్రం అందజేశారు.
గిద్దలూరు, జనవరి 25 : కరోనా వ్యాక్సీన్ వికటించడం వలన మృతిచెందిన ఆశ వర్కర్ విజయలక్ష్మి కుటుంబంలో ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పించాలని కోరుతూ స్థానిక ఆశ వర్కర్లు సీఐటీయూ ఆధ్వర్యంలో అధికారులను కలిసి వినతిపత్రం అందజేశారు. సిఐటియు నాయకులు బండి నరసింహులు మాట్లాడుతూ గుంటూరుకు చెందిన ఆశావర్కర్ విజయలక్ష్మి కరోనా వ్యాక్సిన్ వికటించి మృతిచెందినందున ఆమె కుటుంబానికి రూ.50లక్షల ఎక్స్గ్రేసియా ఇవ్వాలని కోరారు. విజయలక్ష్మి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని కోరారు. బలవంతంగా వ్యాక్సిన్ ఇవ్వవద్దని, వ్యాక్సిన్ ఇచ్చిన తరువాత రెండు రోజులపాటు వైద్యుల పర్యవేక్షణలోనే ఉంచుకోవాలని, వారందరికీ బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. తహసీల్దార్ ప్రేమ్కుమార్ను కలిసి వినతిపత్రం అందచేసిన వారిలో ఆశవర్కర్ల యూనియన్ ప్రతినిధులు రాజమణి, సరోజ, చిన్నమ్మ ఉన్నారు.