ఇంక్రిమెంట్లకు కంపెనీలు రెడీ

ABN , First Publish Date - 2021-04-14T06:22:53+05:30 IST

దేశంలో కొవిడ్‌ మళ్లీ కోరలు చాస్తున్నా కంపెనీలు కొత్త నియామకాలకు, ఉద్యోగులకు 5 నుంచి 10 శాతం జీతాలు పెంచేందుకూ రెడీ అంటున్నాయి

ఇంక్రిమెంట్లకు కంపెనీలు రెడీ

కొత్త నియామకాలకూ ఓకే: జీనియస్‌ కన్సల్టెంట్స్‌ సర్వే


ముంబై: దేశంలో కొవిడ్‌ మళ్లీ కోరలు చాస్తున్నా  కంపెనీలు కొత్త నియామకాలకు, ఉద్యోగులకు 5  నుంచి 10 శాతం జీతాలు పెంచేందుకూ రెడీ అంటున్నాయి. ‘జీనియస్‌ కన్సల్టెంట్స్‌’ అధ్యయనంలో ఈ విషయం తేలింది. ఈ సంస్థ ఐటీ సహా వివిధ రంగాలకు చెందిన దాదాపు 1,200 కంపెనీల ప్రధాన అఽధికారులతో మాట్లాడి ఈ నివేదిక రూపొందించింది. ఈ సర్వేలో పాల్గొన్న కంపెనీల్లో 59 శాతం కంపెనీల ప్రధాన అధికారులు ఈ సంవత్సరం ఉద్యోగుల జీతా లు అయిదు నుంచి 10 శాతం పెంచుతామని చెప్పా రు. 20 శాతం కంపెనీలు మాత్రం ఆర్థిక పరిస్థితి ఇంకా పూర్తిగా కుదుట పడనందున జీతాల పెంపు అయిదు శాతం కంటే తక్కువ స్థాయిలోనే ఉంటుందన్నారు. 21 శాతం కంపెనీలే జీతాల పెంపే ఉండదని స్పష్టం చేశాయి.


నియామకాలు:  ఈ ఏడాది కొత్త నియామకాలు చేపడతాముని 43 శాతం కంపెనీలు చెప్పాయి. 41 శాతం కంపెనీలు మాత్రం అదనపు నియామకాలు లేకపోయినా, ఉద్యోగాలు మానేసిన వారి స్థానంలో కొత్త వారిని తీసుకునేందుకు సిద్ధమవుతున్నాయి. 


ఇతర ముఖ్యాంశాలు :

  • నియర్ల స్థాయిలోనే ఎక్కువ ఉద్యోగాలు.
  • ఇంటి నుంచి పనికి అలవాటు పడిన కంపెనీలు.
  • ఇంటి నుంచి పనితోనూ అదే పనితీరు, ఉత్పాదకత.
  • పెరగనున్న మహిళల సంఖ్య.

Updated Date - 2021-04-14T06:22:53+05:30 IST