శుభ, అశుభ కార్యక్రమాలకు దిక్సూచి పంచాంగం
ABN , First Publish Date - 2022-01-24T05:47:38+05:30 IST
శుభ, అశు భ కార్యక్రమాలకు దిక్సూ చి పంచాంగమని ఎమ్మె ల్యే కంచర్ల భూపాల్రెడ్డి అన్నారు.
నల్లగొండ కల్చరల్, జనవరి 23: శుభ, అశు భ కార్యక్రమాలకు దిక్సూ చి పంచాంగమని ఎమ్మె ల్యే కంచర్ల భూపాల్రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని శివాజీనగర్ టీటీడీ కల్యాణ మండపం లో ఏర్పాటు చేసిన శ్రీశుభకృత నామ సంవత్సర నూతన పంచాంగాన్ని ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. తిథి, నక్షత్రం, వార, ఫలం వంటి వాటిని తెలియజేసే దివ్య గ్రంథం పంచాంగమని పేర్కొన్నారు. నిత్య జీవితం లో చేపట్టే ప్రతి పనులకు పంచాంగం ఆధారంగానే నిర్వహించనున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అర్చక సమాఖ్య వర్కింగ్ ప్రెసిడెంట్ గంగు ఉపేంద్రశర్మ మాట్లాడు తూ అర్చకుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. కార్యక్రమంలో ము నిసిపల్ చైర్మన మందడి సైదిరెడ్డి, వైస్ చైర్మన అబ్బగోని రమేష్, టీఆర్ఎస్ నాయకులు యామ దయాకర్, డీడీఎనఎ్స రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పెన్నా మోహనశర్మ, శ్రవణ్కుమార్, సహదేవ్, కటికం సత్తయ్యగౌడ్, భాస్కర్గౌడ్ పాల్గొన్నారు.