ఎకరానికి రూ.30వేల పరిహారం చెల్లించాలి

ABN , First Publish Date - 2021-10-18T04:52:38+05:30 IST

ఎకరానికి రూ.30వేల పరిహారం చెల్లించాలి

ఎకరానికి రూ.30వేల పరిహారం చెల్లించాలి
విలేకరులతో మాట్లాడుతున్న గుండేటి నర్సింహారెడ్డి

షాద్‌నగర్‌: ఈ ఏడాది కురుస్తున్న భారీ వర్షాలకు పంటలు నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.30వేల చొప్పున పరిహారం చెల్లించాలని బీజేపీ డిమాండ్‌ చేసింది. ఆదివారం పార్టీ నాయకుడు వెంకటేశ్‌గుప్తా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అతివృష్టితో వరి, మొక్కజొన్న, పత్తి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని చెప్పారు. వరి పంటకు తెగుళ్లు, తాలు ఏర్పడి రైతులు నష్టపోతున్నారన్నారు. రాష్ట్రంలో ఫసల్‌ బీమాను ప్రభుత్వం అమలు చేసి ఉంటే రైతులకు పరిహారం అందేదన్నారు. ఇప్పటికైన ప్రభుత్వం నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని కోరారు. బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు మధుసూదన్‌గౌడ్‌, సీనియర్‌ నాయకులు శేషయ్యగుప్తా, గనోజి భాస్కరచారి, శివప్ప, అజయ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-10-18T04:52:38+05:30 IST